ఈనాడు తలుపు తట్టుతున్న కలం
కవితలు రాయగలను...
మనసులను మేల్కొలిపే పదాలు అల్లగలను...
కథలు రాయగలను...
జీవిత సత్యాలను అక్షరాల్లో బంధించగలను...
వ్యాసాలు రాయగలను...
సమాజానికి దారిచూపే ఆలోచనలు పంచగలను...
కలం నా నేస్తం,
తెలుగు నా శ్వాస,
సాహిత్యం నా ప్రయాణం.
ఈనాడు వంటి మహోన్నత వేదికపై
నా అక్షరాలకు అవకాశం దొరికితే,
పాఠకుల హృదయాల్లో
ఆలోచనల దీపం వెలిగించగలను.
కవితలో భావం,
కథలో జీవితం,
వ్యాసంలో విజ్ఞానం నింపి
సమాజానికి ఉపయోగపడే రచనలు అందించగలను.
ఒక అవకాశం ఇవ్వండి...
నా కలం శక్తిని నిరూపిస్తాను.
తేరాల రాజేంద్ర ప్రసాద్ గుప్తా
కవి • కథారచయిత • వ్యాసకర్త
No comments:
Post a Comment