
“గుడులు పెరిగాయి… కానీ గుణాలు పెరిగాయా?”
నేటి మనిషి దేవుణ్ణి గోడపై వేలాడుతున్న ఫోటోలో చూస్తున్నాడు…
నాటి మనిషి ప్రకృతిలో ప్రతి శ్వాసలో దేవత్వాన్ని అనుభవించాడు.
అప్పుడు తపస్సు జీవితం…
ధ్యానం శ్వాస…
ధర్మం నడవడి.
ఇప్పుడు దేవాలయాలు పెరిగాయి…
పూజలు పెరిగాయి…
కానీ మనసుల్లో ప్రశాంతత తగ్గిపోతోందా? అనే ప్రశ్న నిలుస్తోంది.
విగ్రహారాధన తప్పు కాదు.
రూపం మనసును ఏకాగ్రం చేసే సాధనం.
రాయి దేవుడు కాదు…
భక్తిని మేల్కొలిపే గుర్తు.
స్వామి వివేకానంద చెప్పినట్టు:
“విగ్రహాన్ని దేవుడిగా కాదు… దేవుణ్ణి గుర్తు చేసే సాధనంగా చూడాలి.”
రామకృష్ణ పరమహంస చెప్పినట్టు:
“నీరు మంచుగా మారినట్టే… నిరాకారం సాకారమవుతుంది.”
కానీ నిజమైన ప్రశ్న ఇంకొకటి —
మన ఇళ్లలో దేవుడి ఫోటోలు పెరిగాయా?
లేక మన హృదయాల్లో దేవత్వం పెరిగిందా?
ఎందుకంటే…
భక్తి ఉంటే రూపం అవసరం లేదు.
రూపం ఉంటే భావం తప్పనిసరి.
భావం లేని పూజ… శబ్దం మాత్రమే.
దేవుణ్ణి వెతకడం ముందు
మనిషితనాన్ని నిలబెట్టుకోగలిగితే…
అదే నిజమైన ఆరాధన.
ప్రశ్నిస్తోంది కలం : తేరాల రాజేంద్రప్రసాద్ గుప్తా
No comments:
Post a Comment